శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను శ్రీవిభుడుదయించె చెలులాల వినరే అసురుల శిక్షించ నమరుల రక్షించ వసుధ భారమెల్ల నివారింపను వసుదేవికిని దేవకిదేవికిని అసదృశమగు కృష్ణుడవతారమందెను గోపికల మన్నించ గొల్లలనెల్లఁ గావగ దాపై మునులనెల్ల దయసేయను దీపించ నందునుకి దేవియైన యశోదకు యేపున సుతుడై కృష్ణుడిన్నిటఁ బెరిగెను పాండవుల మనుపగ పదారువేల పెండ్లాడగ నిండి శ్రీవేంకటాద్రి పై నిలుచుండగా అండ నలమేల్మంగ నక్కునఁ గాగలించగ దండియై యుండ కృష్ణుడు తగ నుతికెక్కెను
__________Mahatma Gandhi