Online Puja Services

మంగళ సూత్రాల్లో ముత్యాలు, పగడాలు ఎందుకు?

3.16.70.101

మంగళ సూత్రాల్లో తెల్ల పూసలు (ముత్యాలు ) , ఎర్రపూసలు (పగడాలు), నల్లపూసలు ఎందుకు కడతారు ?
లక్ష్మీ రమణ 

మంగళ సూత్రాల్లో చాలా మందికి ముత్యాలూ , పగడాలు , నల్లపూసలు పసుపు తాడుతో వేసి కట్టుకోవడం ఒక సంప్రదాయంగా ఉంటుంది . ఈ సూత్రం కట్టేప్పుడు “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా !కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతం !! అని మంత్రయిక్తంగా మూడుములూ వేస్తారు . అది సమస్త కీడుల్నీ తొలగిస్తుందని విశ్వాసం . కానీ అప్పుడు ఆ సూత్రాల్లో కట్టని పూసల్ని ఎందుకు ఆ తర్వాత సూత్రాలలో వేసి కట్టమన్నారనే దానికి చక్కని వివరణని ఇక్కడ తెలుసుకుందాం !

ముత్యమనేది చంద్రగ్రహానికి ప్రతీక . అందుకే ముత్యం చల్లగా ఉంటుంది . శరీర సౌందర్యం , మనస్సు, శాంతి , ఆనందాలకు , అన్యోన్యమైన దాంపత్యంలకు కారకుడు చంద్రుడు . అదే విధంగా కన్నులు, హార్మోనులు , సిరలు , ధమనులు , గుహ్యావయవములు , ఇంద్రియాలు , గర్భధారణ , ప్రసవములని ప్రభావితం చేసేటటువంటివాడు . 

ఇక పగడము కుజునికి ప్రతీక . అతికోపము , కలహాలు , మూర్ఘత్వం , సామర్ధ్యం , రోగము , అప్పుల బాధలు , మంటలు , విద్యుత్తు అంటే భయము , అతిశయించిన కామ వికారము , దీర్ఘమైన మాంగల్య సౌభాగ్యము , ద్రుష్టి దోషములు కుజగ్రహ ప్రభావాలు . శరీరంలోని కడుపు ప్రాంతాన్ని, రక్తస్రావాన్ని ప్రభావితం చేస్తారు . గర్భస్రావాలు , ఋతుదోషాలని కలిగిస్తారు .
 
వీళ్ళిద్దరూ ఒక స్త్రీ జీవితంపైనా అత్యంత ప్రభావాన్ని చూపిస్తారు . చంద్రుడు 27 నక్షత్రాలలో సంచారాన్ని ముగించుకొని 28వరోజు కుజునితో కలుస్తాడు. అందువల్ల ఆరోగ్యవంతమైన స్త్రీలకి ఖచ్చితంగా 28 రోజులకి రుతుదర్శనం అవ్వాలి .ఇదీ కథ . 

ఇక , వీరిద్దరికీ ప్రతీకలైన ముత్యాన్ని , పగడాన్ని ఎందుకు మంగళసూత్రంలో ధరించామన్నారంటే,సూర్యకిరణాలలోని తెలుపుకాంతిని ముత్యం ద్వారా , యెర్రని కాంతిని పగడం ద్వారా స్త్రీలలోని నాడీవ్యవస్థ గ్రహించ గలుగుతుంది. దానివల్ల ఆమె శరీరం ఉత్తేజితమవుతుంది .  ఈ రెండిటినీ ధరించిన స్త్రీ ఖచ్చితంగా మానసికంగా కొత్తగా వచ్చిన తన కుటుంబ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించగలిగిన స్థితిని పొంది ఉంటారు . దానికి తోడుగా సరైన ఋతు చక్రాన్ని పొందగలుగుతారు . అందుకె , మన పెద్దలకాలంలో వారికి ఆపరేషన్లు చాలా తక్కువగా అవసరమయ్యేవి . ఇప్పటి కాలంలో అసలు ఆపరేషన్ లేకుండా బిడ్డ ఎలా పుడుతుంది అని అడిగే పరిస్థితిలో సమాజం ఉంది.

సాంసారిక జీవనాన్ని ఆనందమయంగా అనుగ్రహించేవాడు కుజుడే కనుక, ఆ జీవనానికి మాంగళ్యంలో పగడం ధరించడం మంచిది అనే కారణాన్ని కూడా శాస్తం మనకి చెబుతుంది . ఇక , నల్లపూసలు ఆమె మాంగల్యానికి దిష్టి తగలకుండా , నీల గౌరిగా భావించి చేర్చేటటువంటి విశేషం.

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore