Online Puja Services

ఓంకార మంత్రం పరమేశ్వరునిది . హుం కార మంత్రం ఆంజనేయునిది .

3.17.173.165

ఓంకార మంత్రం పరమేశ్వరునిది . హుం కార మంత్రం ఆంజనేయునిది . 
సేకరణ 

పరమేశ్వరుని ఒకానొక అంశే ఆంజనేయస్వామి అని మనకి తెలిసినదే ! రామ నామాన్నే అస్త్రంగా చేసుకొని, ఆశ్రిత జన పరిపాలన కోసం, రామునితోటె  యుద్ధం చేసిన వాడు ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడు హుంకరిస్తే , అదే ఒక అస్త్రంగా మారి దేవతలని దానవుల నుండీ రక్షించింది. ఇప్పటికీ ఆయన హుంకారం భక్తులకి అండగా, దండగా నిలిచి వారికి ఆంజనేయునితోపాటుగా ఇతర దేవీదేవతల అనుగ్రహాన్ని సంప్రాప్తిపజేస్తుందని శాస్త్రవచనం . 
 
పూర్వం ఒకసారి , దేవ,దానవులకు భీకర యుద్ధం జరిగింది . ఇరు పక్షాలలో చాలా మంది మరణించారు .ఇంద్రాది దేవత లంతా భయ పడి దాక్కొని ,అనేక చోట్ల తిరుగుతూ బ్రహ్మగారిని  వెంటపెట్టుకోని మహావిష్ణువు దగ్గరకు చేరి తమ బాధ వెళ్ళ బోసుకొన్నారు .అందర్నీ తీసుకొని హరి కైలాసం వెళ్ళారు . పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు .

”శుభంకరా !శంకరా !లోకంలో దరిద్రం తాండవిస్తోంది. కరువు, కాటకాలతో జనం అల్లాడి పోతున్నారు. నువ్వు ప్రసాదించిన వరాల గర్వం ఎక్కువైన రాక్షసులు విజృంభించి అందరినీ బాధిస్తున్నారు. యజ్ఞయాగాదులు  సాగనివ్వ టం లేదు .స్త్రీ లకు రక్షణ లేదు. మానవ భక్షణ, దేవాలయ ధ్వంసం తో వారి ఆగడాలు శృతి మించుతున్నాయి దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రునితో సహా అందర్నీ తరిమేస్తే, వారంతా చెట్టుకొకరు , పుట్టకొకరు అన్న చందంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఆ రాక్షసమూకల  నుండి మమ్మల్ని అందర్నీ నువ్వే రక్షించాలి .ఆలశ్యం చేయ వద్దు ”ఆని ప్రార్ధించాడు .

అప్పుడు పరమేశ్వరుడు ”నా వరాల వల్ల నిమి మొదలైన రాక్షసులు ఇంతకు తెగించారా ? నేను వరమనుగ్రహించినవాడిని వాళ్ళను చంప లేను . కానీ , నేనే హనుమంతునిగా జన్మించి దానవుల పాలిటి యమునిగా మారుతాను . సంహరించుట మీకు తెలుసు .మీ శత్రువులు హనుమను దూషిస్తారు .ఆ దూషణం చేత దివాన్ధులు అన బడే శిబితాశానులు తేజో విహీనం అవుతారు .ఆ సమయంలో వానరాకారుడనైన నేను ”హుంకారం ”చేస్తాను. అదే సమయం గా భావించి ,మీ రందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి. రాక్షసులంతా నశిస్తారు .మీ ఆధిపత్యాలు మీకు మళ్ళీ లభిస్తాసయి .”అని చెప్పి ఊరట కల్గించి వారిని పంపించేశాడు .

మారుతి ఆవిర్భవించాక, శివుని అనుజ్ఞని గుర్తు చేసుకున్న దేవ గణం అంతా గంధ మాదన పర్వతం చేరి ,అక్కడ కొలువై ఉన్న మారుతిని సంస్తుతించారు.

”శ్రీ మన్మహోదార చరిత్రా !సౌవర్ణ దేదీప్య మాన ప్రభా పూర్ణ గాత్రా !కృపా పూర్ణ నేత్రా !జగద్వంద్య కౌండిన్య గోత్రా !జగత్ప్రాణ పుత్రా !పవిత్రాన్జనా నిత్య సంతోష పాత్రా !భక్త రక్షైక దక్షా !సురాధ్యక్షా !దుర్భావ మత్తేభ హర్యక్షా !శ్రీ మత్క్రుపా పూరా పింగాక్షా !శ్రీ దాన సౌసర్వ వ్రుక్షా !సదా సాదు పక్షా !సదా దుష్ట శిక్షా !కరాగ్రాప్త మోక్షా !ముఖ స్థాన రుక్షా !నివ్రుత్తారి రక్షా !శ్రితా భీష్ట దానైక రక్షా !కపీన్ద్రా !హరీ !రామ దూతా !సదా సాదు గేయా !అమేయ ప్రభావా !ఆంజనేయా !నమస్తే నమస్తే నమః ”

అని భక్తీ ఆర్తి కలిపి స్తుతించారు. హనుమ ప్రీత మానసుడై విషయం తెలుసు కోని రాక్షస సంహారానికి అందరితో బయల్దేరాడు .

దానవులు ,దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ శస్త్రాస్త్రాలతో హింసిస్తున్నారు. మారుతికి కోపం విజ్రుమ్భించింది. భూమి ,ఆకాశం దద్ద రిల్లె టట్లు ”హుంకారం ;”చేశాడు .దానితో రాక్ష గణం బలం తగ్గి నిర్వీర్యులవుతున్నారు .అప్పుడు హనుమ ”మూడు శిరస్సులు ,ఆరు నేత్రాలు ,వజ్రాల వంటి కోరలు , భయంకర మైనకత్తు ల వంటి రోమాలు వున్న అతి భయంకార ఆకారంతో కనిపించాడు .రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు, ఆయన నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతై మరికొందరు చనిపోయారు . కొందరు నేలమీద పడి తన్నుకొని చచ్చారు. కొందరు  దేవతల శాస్త్రాస్త్రాలకు బలి అయారు. ఈ విధంగా సర్వ రాక్షస సంహారం జరిగింది. లోక కంటకులు నశించటంతో అందరు హాయిగా ఊపిరి పీల్చు కొన్నారు. హనుమను ప్రస్తుతించారు. అందరికి ఆనందం కల్గింది .అప్పుడు ఆంజనేయుడు ”దేవతలారా !మీరు అన్ని కాలాల్లో నా ”హుమ్కారమన్త్రాన్ని ”న్యాస పూర్వకం గా జపిస్తూ సర్వ శుభాలను బలాన్ని శక్తిని పొందండి ”అని చెప్పి అంతర్ధానమయాడు .ఇదీ హుంకార మంత్ర మహిమ .

అందువలనే ఆంజనేయుడు ఎక్కడ పూజింపబడతాడో అక్కడ దేవతలందరూ కూడా ప్రీతిని పొంది అనుగ్రహాన్ని కురిపిస్తారు. దుష్ట శక్తులు, గ్రహపీడలు,  రాక్షస,పిశాచ శక్తులేవీ వారి ఛాయలకి కూడా రాలేవు . 

 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya