Online Puja Services

శనివారం అంటే ప్రీతికరం ఎందుకని?

18.188.61.223
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసునికి
శనివారం అంటే ప్రీతికరం ఎందుకని?
పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి ?
తీర్థప్రసాదాలు ఎన్ని రకాలు తెలుసుకుందాం ?
 
ఓంకారం ప్రభవించిన రోజు శనివారం . శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో , వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర  స్వామికి వాగ్దానం చేసిన రోజు శనివారం . 

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం .
శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు శనివారం . ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం . 

శ్రీ శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారం . శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం . శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివారం . కనుక శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతి.   పంచభక్ష్య భోజనం అంటే..

1) భక్ష్యము : నమిలి తినుట !
2) భోజ్యము : చప్పరిస్తే కరిగిపోయేది !
3) చోష్యము : పీల్చుకునేది / జుర్రుకునేది !
4) లేహ్యము : నాక్కుంటూ తినదగిన !
5) పానియము : త్రాగేది !
ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు .
 
తీర్థ ప్రసాధాల్లో 4 రకాలు.
 
1) జల తీర్థం 
2) కషాయ తీర్థం
3) పంచమృత తీర్థం
4) పానకా తీర్థం
 
జల తీర్థం.
ఈ తీర్థం ద్వారా అకాల మరణం , సర్వరోగాలు నివారించాబాడుతాయి..అన్నీ కష్టాలు..పోయి ఉపశమానాన్ని ఇస్తాయి. బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది...
 
కషాయతీర్ధం..
ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం , హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు..
రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనిపించే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి. 
 
పంచామృత అభిషేక తీర్థం ..
పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది..
 
పానకా తీర్థం .
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహ దేవునికి...పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి , వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు....
 
పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు..
దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !
కొత్త చైతన్యం వస్తుంది !
దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!
రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , 
నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !
రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !
దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !
జీవితంలో శత్రువుల బాధ ఉండదు!
బుద్ది చురుకుగా పని చేస్తుంది 
జ్జాపకశక్తి పెరుగుతుంది
 
- బి. సునీత శివయ్య 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya