Online Puja Services

మైదా పిండి వాస్తవాలు

3.131.13.194
మైదా పిండి వాస్తవాలు
 
మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పు డైనా ఆలోచించారా………?
 
గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది.
కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది……..? 
 
ఎప్పుడైనా ఆలోచించారా………?
మైదా పిండి ఎలా వస్తుంది????
అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ? గమనిద్దాం. 
 
మైదా వంటకం.. అబ్బో రుచిలో అమోఘం... మైసూరు బజ్జి, మైదాతో చేసిన పునుగులు, సమోసాలు, బ్రెడ్, బన్, కేక్.. అబ్బో... చెప్పుకూంటూ పోతే మైదా లేని వంటకం, జిహ్వ చాపల్యాన్ని తీర్చగలదా?
 
 నోటి రుచి తీరాలంటే మైదా ఉండాల్సిందే... అంతగా వినియోగమవుతున్న మైదా గురించి కళ్లు తిరిగే నిజాలు చాలా మందికి తెలియవు. తెలిస్తే ఆరోగ్యాన్ని కుళ్లబొడిచే దీనికి దూరంగా ఉండడం ఖాయం..!
 
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
 
అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. గోధుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్‌లో ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఈ మైదాపిండి తయారీ చివరిదశలో, పొటాషియం బ్రోమేట్ను అదనంగా జోడిస్తారు. ఇది శరీర కణాలను నష్టపరిచే ఒక శక్తివంతమైన ఆక్సిడైజర్.
 
 కొన్ని దేశాలలో, ఈ బ్రోమేట్ను కొన్ని రకాల క్యాన్సర్ కి కారకమని భావించి, దానిపై నిషేధం విధించారు. మైదా పిండిని తినడానికి ఏవైనా కీటకాలని ప్రయత్నిస్తే, అవి తక్షణమే మరణిస్తాయి. మైదాపిండి అనేది సహజమైన క్రిమి-సంహారకారిగా ఉంటూ, తినే కీటకాలను వెంటనే చంపుతుంది. ...
మైదాలో ఉండేది బూడిదే...
 
మైదాతో ఆరోగ్య ప్రయోజనాలేవీ లేవు. 
మైదా వినియోగం ఆరోగ్యకరం కూడా కాదు.
 
 ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఉంటుంది. మైదాను ద మోస్ట్ డేంజరస్ ఫుడ్ అని కూడా పేర్కొంటారు. 
 
ప్రతి ఒక్కరూ పరోటా తినడాన్ని ఇష్టపడతారు. గోధుమలతో చేసిన పరోటా తినడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. కానీ మైదాతో చేసింది తింటే మాత్రం కష్టమే. గోధుమలో ఫైటోకెమికల్స్, ఫైబర్ , బీ, ఈ విటమిన్లు ఉంటాయి. మైదాకు వచ్చే సరికి గోధుమల బయటి భాగాన్ని తొలగిస్తారు. లోపలి ఉండేది స్టార్చ్ మాత్రమే. నిజానికి ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది. కానీ మనం కొనే మైదా పిండి తెల్లగా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా...?
 
ప్రమాదకరమైన కెమికల్స్ తో బ్లీచింగ్:
 
గోధుమల్లోపలి భాగాన్ని పిండిగా మారిస్తే అది ఎల్లో రంగులో ఉంటుంది. 
దాన్ని తెల్లగా మార్చేందుకు గాను బ్లీచ్ చేస్తారు. ఇందుకోసం పెరాక్సైడ్ ను వాడతారు. 
ఈ ద్రావకాన్ని హాస్పిటల్స్ లో గాయాలు క్లీనింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. 
బెంజిల్ పెరాక్సైడ్ మొటిమల నివారణకు వాడే క్రీముల్లో ఉండే కెమికల్. 
దీనితో పాటు, క్లోరిన్ గ్యాస్ ను కూడా మైదా పిండిని తెల్లగా మార్చేందుకు ఉపయోగిస్తుంటారు.
 
పాశ్చాత్య దేశాల్లో నిషేధం...
 
ఆరోగ్యానికి ఎంతో హాని కలిగించే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ను మెజారిటీ యూరోపియన్ దేశాలు, అమెరికా  నిషేధించాయి. 
ఇక మైదా సాఫ్ట్ అండ్ సిల్కీగా కనిపించేందుకు అల్లోక్సాన్ అనే కెమికల్ ను వాడతారు. ఇది రక్తంలో ఉన్న షుగర్ పై ఫైట్ చేస్తుంది. షుగర్ ఎక్కువైతే ఇన్ ఫ్లమేషన్ మార్పులు జరిగి ఆర్థరైటిస్, గుండె జబ్బులు కూడా వస్తాయి. అల్లోక్సాన్ కెమికల్ అంత్యంత ప్రమాదకరం. 
ఇది పాంక్రియాస్ లోని బీటా కణాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో డయాబెటిస్ మెల్లిటస్ (మధుమేహం) బారినపడతారు. 
అల్లోక్సాన్ ను కలపడం వల్ల మైదా సాఫ్ట్ గా మారుతుంది.
 
గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
 
మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.
 
మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు:
 
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం,
 గుండె జబ్బులు రావడం,
 కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.
 
శరీరాన్ని మైదా పిండి క్రమంగా చంపేస్తుందని తెలుసా..? పరోటా, సమోసా అసలేం చేస్తాయి?
మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే..
 మైదా వాడితే పదార్థాలు చూడటానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్లో ఫలానాది తింటే చాలా బావుందని చెబుతుంటాం. 
 
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
 
 మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. 
అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
 
*సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది.
 
 
 నిత్యజీవితంలో  మనము గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విష ప్రభావము కలిగిన   
మూడు తెలుపు పదార్థములు: 
 
            మైదాపిండి
            ఉప్పు
            పంచదార
 
కావున వీటికి దూరముగా నుండుటకు ప్రయత్నం చేద్ధాము
 
- సేకరణ

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore