Online Puja Services

రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం ఏమిటో తెలుసా?

52.14.22.250
రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు  - వివరణ . 
 
మనలో చాలామందికి మనం తీసుకునే ఆహారం మీద సరైన అవగాహన ఉండదు. సమయానికి ఏది పడితే అది తినేయడం ఆ తరువాత వ్యాధులను మన చేజేతులా మనమే కొనితెచ్చుకుంటున్నాం . మానవులకు రోగాలు రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అతిగా తినటం కూడా రోగకారణమే . ఆయుర్వేదం నందు ఒక సూక్తి ఉంది. " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని చెప్తారు . ఏది పడితే అది కడుపు నిండా తిని జబ్బులను కొనితెచ్చుకోవద్దు. మీరు తినే ఆహారం మీ ఉదరము నందు సగభాగం పట్టునట్టు తిని పావుభాగం నీటికొరకు , మిగిలిన పావుభాగం వాయుప్రసారానికి అనుగుణంగా వదలవలెను. మనం తీసుకునే ఆహారం తక్కువ మోతాదులో ఉన్నను మనశరీరానికి మంచి బలాన్ని , రోగనిరోధకశక్తి ఇచ్చే ఆహారం అయ్యి ఉండవలెను . 
 
ఇప్పుడు మీకు శరీరము నందు రోగనిరోధక శక్తి మరియు బలాన్ని ఇచ్చే ఆహారాల గురించి వివరిస్తాను. 
 
 *  వరి,గోధుమ , ఇతర ధాన్యాలు  - 
 
మన ప్రధాన ఆహారాలు ఐన  వరి, గోధుమ వంటి ఆహారధాన్యాలు పైన పొట్టు తీయకుండా ( పాలిష్ ) తీసుకొనుచున్న ఇవి చాలా బలమైన ఆహారపదార్దాలు. పొట్టులో విటమిన్లు ఉంటాయి. పొట్టులో ఉండే ఒక ముఖ్యమైన విటమిన్ ధాన్యాన్ని పాక్షికంగా ఉడికించడం వల్ల ( ఉప్పుడు బియ్యం ) గింజలోపలి భాగానికి వెళ్తుంది . దంపిన బియ్యం , ఉప్పుడు బియ్యం పొట్టు తీసిన ( పాలిష్ ) బియ్యం కంటే చాలా మంచివి. 
 
 *  ఎండబెట్టిన మొక్కజొన్నలు  - 
ఎండబెట్టిన మొక్కజొన్నలు వండే ముందు పలచటి సున్నపుతేటలో నానబెడితే వాటిలో ఉన్న " నియాసిన్ " అనే విటమిన్ , మాంసకృత్తుల్ని శరీరం బాగా ఉపయోగించుకోగలుగుతుంది. 
 
 *  రాగులు , సజ్జలు , చోళ్లు  - 
వీటిలో ఖనిజ లవణాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం , ఇనుము ఎక్కువుగా ఉంటాయి. ఇవి వరి , గోధుమ కంటే చౌకైనవి , ఎక్కువ బలవర్థకమైన ఆహారాలు . వరి , గోధుమలకు బదులు వీటిని తీసుకోవచ్చు . 
 
 *  పప్పులు  - 
ఏదో ఒక పప్పు కంటే అనేక పప్పుల మిశ్రమం మంచిది . ఒక్కో రకమైన పప్పులో ఒక్కో రకమైన మాంసకృత్తులు ఉంటాయి. పప్పుల మిశ్రమం శరీరానికి కావలసిన అన్నిరకాల మాంసకృత్తులను అందిస్తుంది. 

*  చిక్కుళ్ళు , బటానీలు , సోయాబీన్స్  - 
ఇవి చౌకగా దొరికే మాంసకృత్తులు . పొలాల్లో వీటిని పెంచడం వల్ల భూమిసారం పెరిగి తరువాత వేరే పంట వేస్తే బాగా పెరుగుతుంది . అందువల్ల పంటను మార్చుతూ ఉండాలి. 

*  ఆకుకూరలు  - 
ఎక్కువుగా పచ్చగా ఉన్న ఆకుకూరల్లో కొంచం మాంసకృత్తులు , కొంచం ఇనుము , విటమిన్ A ఎక్కువుగా ఉంటుంది. చిలగడదుంప , చిక్కుడు , బటాణీ , గుమ్మడికాయల ఆకులు చాలా బలవర్ధకమైనవి . వీటిని ఎండబెట్టి పొడిచేసి బిడ్డలకు అన్నంలో కలిపి పెట్టుచున్న మాంసకృత్తులు , విటమిన్లు లభిస్తాయి. క్యాబేజి లాంటి లేతాకు పచ్చ ఆకుకూరలలో మాంసకృత్తులు , విటమిన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కాదు కాబట్టి పెద్దగా తీసుకోవలసిన అవసరం లేదు . 

*  దుంపకూరల ఆకులు  - 
ముల్లంగి , కర్రపెండలం మొదలైన మొక్కల్లో వాటి దుంపల కంటే ఆకులలో ఎక్కువ పోషకపదార్ధాలు ఉంటాయి. కర్రపెండలం ఆకుల్లో , దుంపల కంటే 7 రెట్లు అధికంగా మాంసకృత్తులు , విటమిన్లు ఉంటాయి. దుంపతో కలిపి తింటే ఇంకా ఎక్కువ బలం . లేత ఆకులు చాలా బలం ఇస్తాయి. కాయగూరల్ని , బియ్యాన్ని , ఇతర పదార్ధాలని కొంచం నీటిలో ఉడకబెట్టాలి . ఉడకబెట్టటానికి ముందు కాయగూరలను కోయవలెను . అతిగా ఉడకపెట్టకూడదు . అలా ఉడకపెట్టడం వలన కొంత విటమిన్లు , లవణాలు పోతాయి. ఉడకపెట్టాక మిగిలిన నీటిని పారబోయకూడదు . ఆ నీటిని తాగడమో లేక సూప్ లా చేసుకుని తాగిన చాలా మంచిది . 

కాయగూరలని వండేప్పుడు కొంచం చింతపండు కలిపిన విటమిన్లు పోవు . ఎండి , వాడిపోయిన కూరగాయలకంటే తాజాగా ఉన్నవి ప్రశస్తమైనవి. బలమైనవి. అడవుల్లో దొరికే చాలా పండ్లలో విటమిన్ "C " సహజమైనది ఉండును. పంచదార కూడా అధికంగా ఉండును. విటమిన్ల కొరకు ఈ పండ్లను తీసుకోవచ్చు . తినడానికి ముందు అవి విషపూరితమైనవా ? కావా? అన్నది చూసుకోవడం ఉత్తమం. 

ఇనప పాత్రలలో వండడం వలన లేదా చిక్కుళ్లు లాంటివి ఉడకపెట్టేప్పుడు పాత్రలో తుప్పుపట్టిన ఇనుప ముక్క వేసి ఉడకపెట్టిన ఆ ఆహారము నందు ఇనుము శాతం పెరిగి రక్తహీనత రాకుండా చూస్తుంది. బెల్లాన్ని ఇనుపపాత్రలో తయారుచేయడం వలన ఆ బెల్లము నందు ఇనుము శాతం ఎక్కువుగా ఉండును. పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది . 

పైన చెప్పిన ఆహారాలు మాత్రమే కాకుండా , గుడ్లు , మాంసాహారం కూడా శరీరానికి బలం ఇచ్చును . ఇవి అలవాటు లేనివారు పప్పు , తాజా కూరగాయలు , పండ్లు తీసుకొని శరీరం నందు రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ తింటున్నాం అన్నది కాదు , ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం .       
 
  గమనిక  -
 
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
 
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది. రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు 
9885030034 
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
 
 
 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda