Online Puja Services

వినాయకుడిని దొంగతనంగా తీసుకెళ్తే సంతానం కలుగుతుందట..

3.145.36.10

సంతానం కోసం వినాయకుడిని దొంగతనం

సంతాన భాగ్యం లేని వారికి ఒక తంత్రం చిన్న పరిమాణంలో వినాయకుడిని దొంగలిచి తెచ్చి సంతానం కోరుకొని పూజించాలి ఫలిస్తుంది, ఇంక ఏ కారణం చేత దొంగతనం చేయాకుడదు.

నా లాంటి వాళ్ళు ఇలాంటి గ్రూవ్ లో దొంగతనం అని పోస్ట్ పెడితే ఎన్ని విమర్శలు వస్తుందో నాకు తెలుసు, నా ఇంట్లోనే మా అమ్మకు తెలియకుండా ఏది తీసుకునే అలవాటు లేని నేను అంత ధైర్యంగా వినాకుడిని తీసుకొని రమ్మని ఎలా చెప్తాను అలా మీరు చేస్తే ఆ పాపం లో నాకు భాగం కదా నాకు ఆ భయం ఉంటుంది కధా అయినా చెప్పాను అంటే అది నిజం అని నమ్మాను నాకు ఇది చెప్పిన వారిని నమ్మాను ఎన్నో నిదర్శనాలు చూసాను.. కనుకే ఇంత ధైర్యంగా చెప్పాను...

నాకు చింతనంలో దేవుడి పాటలు నేర్చుకోవడానికి ఒక బ్రహ్మీన్స్ ఇంటికి వెళ్లే దాన్ని అది అంతా బ్రహ్మీన్స్ ఉండే కాలనీ చిన్న అగ్రహారం లాంటిది అనుకోండి అక్కడ ఆ రోజు మెల తాళాలతో మంగళ వాయిద్యాలతో ఒక బ్రహ్మీన్స్ కుటుంబం పల్లకిలో చిన్న వినాయకుడి విగ్రహం ఊరేగింపుగా తీసుకుని వస్తున్నారు.. ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంట్లో వాళ్ళు సంబరంగా వచ్చి ఆ బుజ్జి వినాయకుడి కి హారతి ఇచ్చి ఆ ఇంటి యజమాని ఆ వినాయకుడిని అపురూపంగా చేతిలోకి తీసుకుని ఇంట్లోకి వెళ్ళరు ఆ తెచ్చిన ఆవిడ అక్కడ స్త్రీలు అందరికి తాంబులం ఇచ్చి బిడ్డ ఆమె ఆశీర్వాదం తీసుకుంటున్నారు.. నాకు పాటలు నేర్పే వాళ్ళు కూడా నన్ను అక్కడే ఉండమని వెళ్లి పలకరించి తాంబులం తీసుకుని వచ్చారు.. తర్వాత జరిగిన విషయం ఇలా చెప్పారు .

10 సం పిల్లలు లేక ఎన్నో పూజలు నోములు నోచి ఆరోగ్యపరంగా ఏ లోపం లేదు అని డాక్టర్స్ చెప్పిన సంతానం లేదు అని అదే కాలనీ లో బాగా పూజలు చేసే ఒకరి ఇంట్లో వారికి తెలియకుండా నే దొంగతనం గా వినాయకుడి ని తీసుకుని వెళ్లిపోయారు ఆ కుటుంబంలో వారికి కూడా ఆమె తప్పా ఎవరూ ఆ రోజు రాలేదు అని తెలుసు.. అయినా ఆమెను ఎవరూ ఏమీ అనకండి అని ఆ ఇంటి యజమాని చెప్పే సరికి అనుమానం ఉన్నా ఆమెను ఎవరూ ఏమీ అడగలేదు.. తర్వాత ఆమెకు సంతానం కలిగాక మెళ తాళలతో వారికి తిరిగి తీసుకుని వచ్చి క్షమాపణ చెప్పుకున్నారు వాళ్ళు కూడా ముందే ఊహించారు కనుక పర్వాలేదు అని సంతోషంగా ఆశీర్వదించారు అది అప్పటి వారి సంస్కారం ఇప్పుడైతే ఎన్ని శపిస్తారో..

అయితే అప్పుడు నేను కూడా దోంగతనం అది కూడా వినాయకుడిని తోలు తీస్తాడు అపద్ధము చెప్తేనే ఏకంగా దొంగతనం అధికుడా స్వామి నే అని అడిగాను అప్పుడు ఆ అమ్మమ్మ గారు ఒక కథ చెప్పారు..

రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరూ కీర్తిస్తారు అక్కడికి వచ్చిన వారంతా పార్వతి దేవిని కూడా గొప్ప గా ప్రసంసిస్తున్నారు వినాయకుడిని పొగుడుతుంటే తల్లిగా ఆమె గర్వంగా పొంగిపోతుంది.. తల్లి అంతే కదా అది గమనించిన లక్ష్మీ దేవికి కూడా ఇలాంటి బిడ్డ నాకు కావలి అనే ఆశ కలిగింది సహజమే కదా.. అదే కోరిక విష్ణు మూర్తిని అడిగింది ఆ వినాయకుడే నాకు కొడుకుగా కావలి స్వామి అని వినాయకుడు పార్వతి ముద్దుల తనయుడు ఆ బిడ్డే కావాలి అని కోరుతోంది లక్ష్మీ దేవి కూడా స్వామి ఆలోచించి నువ్వే వినాయకుడిని ప్రార్ధించు అని సలహా ఇస్తారు.. ఇంక లక్ష్మీ దేవి వెంటనే తపస్సు చేసి అయినా ఆ వినాయకుడిని కుమారుడిగా పొందాలి అని నిర్ణయించు కుని తపస్సు మొదలు పెడుతుంది తల్లి మనస్సు తపిస్తే అది ఆయనకు వినిపించడానికి ఎంత సేపు పరుగున వచ్చి ఆ తల్లి ముందు అమ్మ పిలిచారు అని నినయంగా నమస్కరించి నిల్చుంటాడు అప్పుడు లక్ష్మీ దేవి ఈ పిలుపు నీ నుండి నాకు శాశ్వతంగా కావాలి నాయనా అని కోరుకుంటుంది.. అంటే తల్లి అని అడుగుతూడు..

నిన్ను కొడుకుగా పొంది పార్వతీ దేవి ఎంతో పుణ్యం చేసుకుంది నాకు నువ్వు కొడుకుగా కావాలి అన్న ఆశకలిగింది నాయనా అంటుంది.. అప్పుడు వినాయకుడు అది నాకు వరం తల్లి అలాగే కానివ్వు అంటారు.. అంతే ఓప్పుకోవడమే తరువుగా వినాయకుడిని చంటి బిడ్డగా మార్చి చంకలో వేసుకుని వైకుంఠం తీసుకుని వెళ్ళిపోతుంది.. పార్వతిదేవికి ఒక్కమాట కూడా చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయి నందుకు ఒక విధంగా దొంగతనమే కదా ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వరుల ఆమె ముచ్చట కి నవ్వుకుంటున్నారు...

ఇంక వైకుంఠకి తీసుకు వచ్చిన వినాయకుడికి పూర్ణనందుడు అని నామ కరణం చేస్తుంది లక్ష్మీ దేవి పూర్ణం బూరెలు అక్కడే అలవాటు అయ్యింది స్వామికి అక్కడ ఏమో కుడుములు.. ఇలా పూర్ణానందుడుని లాలిస్తూ బుజ్జగిస్తూ ఆనందంగా మురిసపోతుంది ఆ తల్లి ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే ఎక్కుడ ఉన్నారు మీరు వైకుంఠ వెళ్లి అడగండి అని అక్కడికి పంపుతారు అక్కడ విష్ణు మూర్తిని ప్రాధిస్తే లక్ష్మీ దేవిని అడగమని పిలుస్తారు.. ఆ తల్లి నా బిడ్డ పూర్ణానందుడు చాలా చిన్నవాడు యుద్ధాలు అప్పుడే చేయడు నేను పంపను అనేస్తారు అక్కడే ఉన్న బుజ్జి గణపతి కూడా మా అమ్మ ఒప్పుకోక పోతే నేను రాను అని తల్లిబిడ్డలు లోపలికి వెళ్ళిపోతారు.. తర్వాత విష్ణువు లక్ష్మీదేవి తో మన కొడుకుగా వెళ్లి రాక్షస సంహారం చేసి వస్తే అది మనకు ఎంత గర్వకారణం యుద్ధానికి పంపు అని ఒప్పిస్తారు .. తర్వాత వినాయకుడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత అందరూ వైకుంఠ చేరి పూర్ణనందుడిని ప్రసంసిస్తారు .. తర్వాత వినాయకుడి లక్ష్మీ దేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం వెళ్ళిపోతాడు.. 

అందుకే విష్ణు దేవాలయం లో విశ్వక్సేనుడు రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు.. శివాలయంలో, వినాయకుడి గుడిలో తులసి వాడరు.. ఈ కథ తెలిసాక చాలా మందికి ఈ విషయం చెప్పాను వారిలో చాలా మందికి ఫలించింది

అందుకే సంతానం లేని స్త్రీ లు దంపతులు ఎవ్వరైనా వినాయకుడిని దొంగతనం గా తీసుకుని వెళ్లి సంతానం కోసం ఇలా తెచ్చాను అని క్షమాపణ కోరి రోజు పూజ చేస్తే ఆయన సంతోషంగా అనుగ్రహిస్తారు.. సంతానం ఉండి కూడా మళ్లీ సంతానం కోరి దొంగతనంగా తీసుకుని రాకూడదు.. చవితి రోజు పూజించి నిమర్జన చేయాల్సిన విగ్రహం తీసుకుని రాకూడదు గుడిలో ఎక్కడా తీసుకుని రాకూడదు.. చాలా చిన్న పరిమాణంలో ఉండేది షాప్ లేక ఇంట్లో నో తీసుకుని రావాలి.. ఎక్కడ నుండి దొంగతనం చేస్తారో వారికి కూడా స్వామి అనుగ్రహం దక్కుతుంది.. నష్టం ఏమీ కలగదు.

ఎందరో ఆరోగ్య సమస్య లేకున్నా సంతానం కలగక ఎంతో బాధ పడుతున్నారు అందుకె కొందరు విమర్శిస్తారు అని తెలిసినా ఇలా పోస్ట్ పెట్టాను ఎవరి నమ్మకం వారిది.. ఫలించాకగుడిలో అన్నదానం అభిషేకం చేయించండి.. ఎక్కడ తెచ్చారో వారికి ఎదో రూపంలో కానుక ఇచ్చేయండి.. కానీ నమ్మితేనే చేయండి.. దొంగతనం ఎలా చేయాలి అని నన్ను అడగకండి నాకు తోటలో మామిడి కాయ దొంగలించే తెలివి కూడా లేదు మీ తిప్పలు మీరు పడండి.. అన్ని టెస్టులు సరిగ్గా ఉండి కూడా పిల్లలు కలగక కొందరు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పుకుని బాధ పడతా ఉంటారు చాలా కష్టంగా ఉంటుంది భర్త వదిలేస్తాను అంటున్నాడు అని ఏడుస్తారు ఇంకో పెళ్లి అంటున్నారు అని ఎందరో అలా ఏడుస్తుంటే ప్రాణం అల్లాడిపోతుంది వారి ఏడుపు విని రాస్తుంటే కూడా కళ్ళలో నీళ్ళు వస్తుంది అది వింటే నే అంత బాధగా ఉంటే వారికి ఇంక ఎంత కష్టంగా ఉంటుంది అందుకే నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు అని నేను నమ్మిన ఈ విషయం ఇక్కడ రాశాను.

శ్రీ మాత్రే నమః

భానుమతి అక్కిశెట్టి 

 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore