Online Puja Services

సర్ప యాగం - భౌతిక నిరూపణ

3.23.101.60

సర్ప యాగం - భౌతిక నిరూపణ :

నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా వుంటుంది. నాగుల మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. శేషునాగు, వాసుకి అనే రెండు పెద్ద సర్పాలు ఇక్కడ వుంటాయి.క్షీరసాగర మధనంలో ఉపయోగపడిన వాసుకి ఇప్పటికీ వుందంటే నమ్మగలరా? దానికి సజీవసాక్ష్యాలు దొరికాయట. మరి నిజంగా నాగలోకం వుందా?నాగ లోకానికి సంబంధించినవి కట్టుకథలు .....అని కొందరు అంటుంటే అవన్నీ నిజాలే అంటున్నారు కొంతమంది పరిశోధకులు.

జీమూతకేతువు అనే రాజు చాలాకాలం రాజ్యం చేసి మంచివాడని, న్యాయమూర్తి అని కీర్తిగడించాడు. ఇతనికి జీమూతవాహనుడు అనే కుమారుడు కలిగాడు. ఇతడు జీవం ఉన్న అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించేవాడు, తల్లిదండ్రుల మీద అమితమైన భక్తి కలిగి తండ్రి రాజ్యాన్ని పాలించమన్నా, అతడు అంగీకరించలేదు.

తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి కోరినవన్నింటినీ చేకూర్చే కల్పవృక్షాన్ని పేదలకు ఇచ్చివేశాడు. ఒకనాడు పర్ణశాల కోసం మలయ పర్వతం అనే కొండమీదకి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవి ని కమ్మని వీణాగానంతో ప్రార్ధిస్తున్న మలయవతిని చూచి, ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తుందగా, అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న పాముల ఎముకలగుట్ట కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది.

అన్ని పాములకు తానేమీ సహాయం చేయనందుకు బాధపడ్డాడు. అక్కడే విలపిస్తున్న ఒక తల్లిని చూశాడు. విషయం తెలుసుకోవడానికి వివరాలు అడుగగా.... ఈ రోజు గరుత్మంతునికి తన కొడుకు శంఖచూడుడు ఆహారంగా వెళుతున్నట్లు చెప్పింది. గరుత్మంతుడికి పాములంటే విరోధం ఉండేది.

అతడు నాగలోకం మీదపడి పాముల్ని కనికరం లేకుండా తినేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతునికి ప్రతిరోజు ఒక పామును ఆహారంగా పంపుతానని ప్రార్ధించి ఒప్పించాడు. ఈ రోజు నా కొడుకు వంతు అని వివరించింది.

అప్పుడు శంఖచూడునికి బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళతాను, అని అవ్వకి మాటిచ్చి బలిపీఠమైన పెద్దబండ మీద జీమూతవాహనుడు పడుకొన్నాడు. గరుత్మంతుడు బండమీది జీమూతవాహనున్ని తినడం మొదలుపెట్టాడు.

కొంతసేపటి తర్వాత ఏదో పొరపాటు జరిగినట్లుగా సందేహం కలిగి తినడం ఆపి తాను తింటున్నది జీమూతవాహనుని అని తెలిసి జరిగిన పొరపాటుకు తన్నుతాను తిట్టుకున్నాడు. శంఖచూడుడు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. జీమూతవాహనుని భార్య, తల్లిదండ్రులూ చేరి ఏడుస్తున్నారు.

ఎలాగైనా వారి దు॰ఖాన్ని పోగొట్టాలని, అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని దేవలోకం వెళ్ళి అమృతం తీసుకొని వచ్చి జీమూతవాహనున్ని బ్రతికించాడు. అందరూ సంతోషించారు. అప్పుడు జీమూతవాహనుడు గరుత్మంతుని శక్తిసామర్ధ్యాలను పొగిడి, తనను బ్రతికించినట్లే చనిపోయిన పాములన్నింటినీ బ్రతికించి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. అందుకు గరుత్మంతుడు అంగీకరించి తాను తెచ్చిన అమృతంతో పాములన్నింటిని బ్రతికించాడు.

దానికి బలం చేకూర్చేలా ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో ఫితుర్గడ్ జిల్లా ఉంది. ఇక్కడ నుండి 85 కి.మీ. ల దూరంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహలున్నాయి. ఈ గుహల్లో నాగలోకం మిస్టరీ దాగి ఉన్నది.ఈ గుహలోనే వాసుకి సర్పం యొక్క జాడలు కనిపిస్తాయి.కాని ఇందులోకి వెళ్ళటంమాత్రం అంత తేలిక కాదు.

ఉపరితలం నుండి 90అడుగుల లోతుకి వెళ్ళాక, ఒక గుహ వుంటుంది. ఇక్కడ శేషనాగు ఆకారంలో ఒక ఆకృతికనిపిస్తుంది.దానిపై అర్ధ వృత్తాకారంలో ఒక సహజనిర్మాణం వుంటుంది.ఇంకా శేషనాగు కోరలు లాంటి అమరికలు దాని విషపుపళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి.

సరిగ్గా ఇదే ప్రదేశంలో పూర్వం కొన్ని లక్షల, కోట్ల పాములుండేవట ! ఈ ప్రదేశంలోనే అర్జునుని మునిమనవడు అయిన 

జనమేజయ  మహారాజు తన తండ్రి పాముకాటుకు గురయ్యాడని తెలుస్తుంది.

 
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya