Online Puja Services

మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???

18.188.168.28

నిత్య జీవితంలో - ప్రాతినిధ్యం స్నానం చేసి శరీరం శుద్ధి చేసుకొంటాము, ఇంట్లో ఏమైనా జరిగితే, పుణ్యాహవచనం చేసి ఇల్లు శుద్ధి చేసుకొంటాము, కానీ ప్రతినిత్యం భగవంతునికి అర్పించే, ఈ మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???

భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం _ సంస్థాప్య సంవిత్ఫలం, సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం - కల్యాణ మాపాదయన్ !!
-- ఆదిశంకరుల వారు --

విశేషం_ పుణ్యాహవాచనం :

ఇది యొక శుద్ధి కర్మ , ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి
కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై ఉంచి మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని పొందుతారు...

తాత్పర్యము :

ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 
నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను చుట్టి , సంతోషము అనే నీటితో నింపిన నామనస్సు అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 
జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.

( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం )

వివరణ:

సామాన్యంగా మైలగానీ, పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ, అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా చల్లాలి... ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. 

అప్పుడు ఆ ఇల్లూ ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు...
 అలాగే భక్తుల,హృదయాలు అరిషడ్వర్గాలతో, అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి
చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు...

శంకరులు ఇలా అన్నారు...

ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప, దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదించాలి...
దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి, పుణ్యాహవాచన
కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. 
ముందుగా కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  
నామనస్సనే కలశం ప్రసన్నంగా 
స్వచ్ఛంగా వుంది... 
కలశానికి దారాలు ఛుట్టాలి, నేను నాభక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను. 
నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను...
కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు దొరికిన ఆ చిగుళ్ళు...
అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 
నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను, ఇంక కలశంపై ఒక ఫలం ఉంచాలి...
నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను. 
తరువాత మంత్రాలు చదవాలి.  
నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని చదువుతాను. 

ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ, వాక్కూ పవిత్రమవుతాయి. 
ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 
చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలని,  
ఈ శ్లోకం ద్వారా శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.
                     
శుభమస్తు
            
  సమస్త లోకా సుఖినోభవంతు

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya