Online Puja Services

కృష్ణుడు దేవకీదేవికి అన్యాయం చేశాడా ?

3.138.200.66

గురుమాత గర్భశోకాన్ని తీర్చగలిగిన కృష్ణుడు దేవకీదేవికి అన్యాయం చేశాడా ?
-లక్ష్మీ రమణ 

కంసుడు దేవకీదేవి గర్భంలో కృష్ణుడికి ముందర జన్మించిన సంతానాన్నీ కడతేర్చాడు.ఆ తల్లి పుత్రశోకంతో తల్లడిల్లిపోయింది.  అందుకు నారదుడి కారణమయ్యాడు. కానీ తన గురువైన సాందీపునికి  గురుదక్షిణ చెల్లించడానికి యమునితో పోరాడి ఆయన పుత్రుణ్ణి తీసుకురాగలిగిన కృష్ణుడు , దేవకీదేవి పుత్రశోకాన్ని ఎందుకు తీర్చిలేకపోయాడు ?  

సాందీపుని దగ్గర బలరామ కృష్ణుల  విద్యాభాసం ముగిసింది. తిరిగి ఆయన రాజ్యభారాన్ని వహించేందుకు రాజ్యానికి వెల్లసిన సమయం వచ్చేసింది . అప్పుడు వారు తమ గురువు దగ్గరికి వెళ్లి, గురుదక్షిణగా ఏమివ్వాలని అడుగుతారు . అప్పుడాయన , ప్రభాసతీర్థంలో తప్పిపోయిన తమ పుత్రుణ్ణి వెతికి తెచ్చిఇయ్యమని అడుగుతారు . పరమాత్మకు అసాధ్యమైనదేముంటుంది. 

ఆయన ఆ గురుపుత్రుడు సముద్రగర్భంలో దాగిన పాంచజనుడనే రాక్షసుని గర్భంలో ఉన్నాడని తెలుసుకొని వాడిని చంపి వాడి గర్భంలో వెతుకుతారు. అక్కడ పాంచజన్యమనే శంఖం తప్ప మరేమీ దొరకదు . అప్పుడు యమపురికి వెళ్లి అక్కడ తొలిసారి ఆ పాంచజన్యాన్ని (శంఖాన్ని ) పూరిస్తాడు  పరమాత్మ. ఆ శబ్దానికి అదిరిపడ్డ యముడు సరాసరి ఆ గురుపుత్రుణ్ణి తీసుకొచ్చి కృష్ణునికి అప్పగిస్తాడు . ఆయన ఆ పిల్లవాడిని గురువుగారికి అప్పగించి తన గురుదక్షిణ చెల్లిస్తారు . 

ఇంతటి వీరోచితంగా గురువుగారి బిడ్డని రక్షించిన స్వామీ కన్నతల్లికి ఏర్పడిన గర్భశోకాన్ని తీర్చలేకపోయారా ? ఆ దేవకీదేవి కడుపుతీపిని తిరిగి తేలేకపోయారా ? అంటే, దేవకీదేవి అడిగాక ఆపని ఆయన చేయకుండా ఉంటారా ?

దేవకీదేవి యముడివద్దకి వెళ్లి కృష్ణుడిని తన అన్నలని తీసుకురావలసిందిగా కోరినప్పుడు , వారు యమలోకంలో లేరు . బాలి అనేరాజు పరిపాలనలో ఉన్న సుతల లోకంలో ఉన్నారు . వారిని శ్రీకృష్ణుడు తీసుకువచ్చారు. అప్పుడామె తన ఎనిమిదిమంది సంతానాన్ని ఒకేదగ్గర చూసుకొని ఆనందించారు . కానీ వారు ఎక్కువకాలం దేవకీ దేవి దగ్గర ఉండలేకపోయారు . ఎందుచేతనంటే, వాళ్లకున్న శాపం అలాంటిది మరి . 

దేవకీ పుత్రులలో మొదటి ఆరుగురు గత జన్మలో కాలనేమి పుత్రులు. వారిని తండ్రే చంపుతాడు అని హిరణ్య కశిపుడు శపిస్తాడు. ఆవిధంగానే మరుజన్మ లో కంసుడిగా జన్మించిన కాలనేమి, దేవకీ గర్భాన మొదట పుట్టిన ఆరుగురిని చంపుతాడు. కాలనేమి పుత్రుల పేర్లు – హంస, సువికర్మ, కృత, దమన, రిపుర్మర్దన, క్రోధహంత.  వీరందరూ కూడా రాక్షసులే అయినా , పరమాత్మ అనుగ్రహం వలన, ఆయనకి సోదరులై జన్మించి మోక్షాన్ని పొందారు . అదీ కథ . 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba