Online Puja Services

హిమలింగ దర్శనం అమర్‌నాథ్‌ యాత్ర

18.219.236.62

భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్‌ రాష్ట్రంలో అమర్‌నాథ్‌ పర్వతంపెై ఉన్న గుహ హిందూమత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం లో శివుడు హిమలింగ రూపంలో కొలువు దీరాడు. ఈ పుణ్యక్షేత్రానికి 5,000 సంవత్సరా లకు పెైబడిన చరిత్ర ఉంది.

ప్రధాన గుహ లోపల శివలింగం ఉంటుంది. ఇది మే నుంచి ఆగష్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయంలో గరిష్ఠ ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ గుహలోనే శివుడు తన దెైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించాడు. ఇంకో రెండు మంచు ఆకారాలు పార్వతి, శివుడు కుమారుడు అయిన గణేశుడిని సూచిస్తాయి.

అమరనాథ్ గుహలు భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో గల ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ క్షేత్ర ప్రధాన దైవం "శివుడు".

మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది... ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్‌!

ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే.

అమర్‌నాథ్‌ గుహ! జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని మంచు కొండపై, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ గురించిన పురాణ కథ ఇది. దేశంలోనే అతి పెద్ద గుహగా 75 అడుగుల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్‌, ఆగస్టుల మధ్య కాలంలో మంచు శివలింగాకారంలో ఏర్పడడం ఓ భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన ఇక్కడికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అమర్‌నాథ్‌ గుహ ఓబాలుడి వల్ల బయటపడడం ఒక విశేషం. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ మంచు కొండ ఎక్కినప్పుడు తొలిసారిగా దీన్ని చూశాడని చెబుతారు. ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు. అమర్‌నాథ్‌ సంబంధించిన ప్రస్తావన క్రీస్తుపూర్వం 34 నుంచి అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాలలో కనిపిస్తుంది. భక్తులు పహల్గామ్‌ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.

జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్‌ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్‌ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్‌ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. అమర్‌నాథ్‌ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనే సరస్సు నుంచి బొట్టు బొట్టుగా పడే నీరు గడ్డకడుగూ ఏడడుగుల ఎత్తయిన శివలింగంగా ఏర్పడుతుంది. దీని ఎత్తు చంద్రుని హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని చెబుతారు.

* విశేషాలు

ఈ గుహ 3,888 మీ (12,756 అడుగులు) ఎత్తులో గలదు.ఇది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర ముఖ్య పట్టనమైన శ్రీనగర్ కు 141 కిలోమీటర్ల దూరంలో గలదు. ఈ దేవాలయానికి పహల్గావ్ పట్టణం గుండా చేరుకోవచ్చు. ఈ క్షేత్రం హిందూ మతంలో ప్రసిద్ధమైనది మరియు హిందూ పవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ గుహ మంచుతో కూడిన పత్వతాలతో చుట్టుముట్టి ఉంది. ఈ గుహ మంచుతో నిరంతరం కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో కొద్ది కాలంలో మాత్రమే యాత్రికులు దర్శించడానికి వీలుగా ఉంటుంది.అనేక వేలమంది హిందూ భక్తులు ప్రతి సంవత్సరం ఈ గుహలలో గల మంచుతో కూడిన శివలింగం దర్శించడానికి వస్తూంటారు. ఇది శివునికి అంకితమైన పుణ్యక్షేత్రం. ఇది 5,000 సంవత్సరాలకు పైబడిన పాత ఆలయం. ఈ ఆలయం హిందూ పురాణాలలో ఒక ముఖ్య భూమిక వహిస్తుంది. ప్రధాన అమర్నాథ్ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక మంచు ఆకారం ఉంటుంది. ఇది మే నుంచి ఆగష్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి యొక్క దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయములో మంచి ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ గుహలోనే శివుడు తన దైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత యొక్క రహస్యము మరియు సనాతనం గురించి వివరించారు. ఇంకో రెండు మంచు ఆకారాలు పార్వతి మరియు శివుడు కుమారుడు అయిన గణేశవని సూచిస్తాయి. ఈ గుహ, జమ్మూ మరియు కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్ కు సుమారు 141 కిమీ (88 మైళ్ళు) దూరములో, 3,888 మీ (12,756 అడుగులు), ఎత్తులో ఉంది. భద్రతా కారణాల వలన, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, భారత సైన్యం మరియు భారత పారామిలిటరీ దళాలు ఈ ప్రాంతములో తమ బలగాలను మొహరించాయి.

* చరిత్ర

అర్యరాజ (34 బిసిఈ -17 సిఈ) "తన అత్యంత ఆనందకరమైన కాశ్మీర్ వేసవి"ని, "అడవుల పైన ఉన్న ప్రదేశాలలో" మంచు లింగాన్ని పూజ చేసుకుంటూ గడిపేవాడు. ఇది కూడా అమర్నాథ్ లోని మంచు లింగాన్నే సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. రాజతరంగిణి లో అమరేశ్వర లేదా అమర్నాథ్ ను సూచిస్తూ మరొక సూచన ఉంది. కల్హన ప్రకారం, రాజు అనంత (1028–1063) బార్య అయిన రాణి సూర్యమతి , "అమరేశ్వలో అగ్రహారాలను దానముగా తన భర్త పేరు మీద ఇచ్చి, త్రిశూలాలు, బాణలింగాలు మరియు ఇతర [పుణ్య చిహ్నాలు] వాస్తవాలను అక్కడ ఏర్పాటు చేశారు."

లిడ్డెర్ (vv.1232-1234) నది యొక్క ఎడమ తీరములో ఒక కాలువను నిర్మిస్తున్న సందర్భంగా సుల్తాన్ జైనుల్-అబిడిన్ (1420–1470) అమర్నాథ్ లోని పుణ్యతీర్థాన్ని సందర్శించాడని కల్హన యొక్క రాజతరంగిణికి తదుపరి రచనగా వ్రాయబడిన తన కాశ్మీర్ క్రానికల్ లో జోనరాజా వ్రాశాడు. ప్రస్తుతం ఈ కాలువ షా కోల్ వి.అమర్నాథ్ గా పిలవబడుతుంది. ప్ర్జజయభట్టచే ప్రారంభించబడి శుకచే ముగించబడిన రాజవలిపాటక అని పిలవబడే నాల్గవ క్రానికిల్ లో ఈ పుణ్య స్థలానికి తీర్థయాత్ర వెళ్ళిన సంఘటన గురించి స్పష్టమైన వివరాలు ఉన్నాయి (వి.841, డబల్యూ . 847-849). దాని ప్రకారం, అప్పట్లో కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న యూసుఫ్ ఖాన్ ను కాశ్మీర్ గురించి అక్బర్ అడిగినప్పుడు, అతను ఇతర విషయాలతో పాటు అమర్నాథ్ యాత్రను సవివరంగా వివరించాడు. దేవుడు శివుడు యొక్క గొప్ప భక్తుడైన సంట్‌బెట్రా స్వామి రామానంద్ జి మహారాజ్ చడ్డితో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవాడట.అతను షేర్ కి స్వారిని చేస్తూ ఉండేవాడని చెప్పబడుతుంది.పిఓకే లో ఉన్న బెహట్రానే అతని స్వస్థలం. సంట్ బెట్రా అశోక.


* తీర్థయాత్ర

హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం- జూలై-ఆగష్టులో శ్రావణి మేళ పండగ సమయములో 45-రోజులలో సుమారు 400,000 మంది సందర్శిస్తారు. ఇది హిందువుల పుణ్యమాసమైన శ్రావణ మాసములో ఉంటుంది. శ్రీనగర్ నుంచి 96 కిమీ (60 మైళ్ళు) దూరములో ఉన్న పహల్గం పట్టణము నుండి భక్తులు నడుచుకుంటూ నాలుగు లేక ఐదు రోజులు ప్రయాణం చేసి ఈ 42 కిమీ (26 మైళ్ళు) తీర్ధయాత్రను చేపడతారు. ఈ ఆలయానికి మరో రెండు మార్గాలు ఉన్నాయి; శ్రీనగర్ నుంచి ఎక్కువ సాంప్రదాయ మరియు ఎక్కువ దూరమైన దారి, మరియు బల్తాల్ పట్టణము నుంచి తక్కువ దూరమైన దారి ఉన్నాయి. కొందరు భక్తులు, ముఖ్యంగా వృద్దులు, గుర్రంపై కూర్చుని కూడా ఈ ప్రయాణాన్ని చేపడతారు. ఇప్పుడు, కావాలనుకునేవారు, డబ్బు ఉన్నవారు ఈ ప్రయాణాన్ని హెలికాప్టర్ ద్వారా చేయవచ్చు.  ఈ ఫొటో ని 1940 లో తీసినది

- రామకృష్ణ కోట 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya