Online Puja Services

అలా రాములోరు సేదతీరిన ప్రాంతాలే మహా శివక్షేత్రాలయ్యాయి

3.147.66.178

అలా రాములోరు సేదతీరిన ప్రాంతాలే మహా శివక్షేత్రాలయ్యాయి . 
సేకరణ: లక్ష్మి రమణ 

రావణ వధ తర్వాత శ్రీరామ చంద్రుడు విభీషణునికి లంకా పట్టాభిషేకం చేశారు . ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినా , ఆయన్ని బ్రహ్మ హత్యాపాతకం వెంటాడింది, దానికి ఉపశమనాన్ని వెతుకుతూ ,  కొన్ని ప్రాంతాలలో ఆగారు .  సేద తీరారు .  పరమేశ్వరుని అర్చించారు. అలా రామునిచేత ప్రతిష్టించబడిన శివలింగాలు ఇప్పటికీ భక్తులకి కొంగుబంగారమై కోరిన కోర్కెలను తీరుస్తున్నాయి . 

రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు. వందారుమూలైలో ఉన్నప్పుడు రాములవారికి అనుమానం తలెత్తింది .  రావణుడు బ్రాహ్మణుడు.  అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా! అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరారు . 

అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి , నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రామునికి సూచన చేశారట .  దీంతో రాములోరు  లంకలో ‘మానావారి’ అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని ‘రామలింగ శివుడనే ‘ పేర కొలుస్తారు. 

ఆ తరువాత , ‘తిరుకోణేశ్వరం’లో, అక్కడి నుంచి ‘తిరుకేదారేశ్వరం’లో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించారు.  చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. 

పుష్పకంపై తిరిగి వెళ్తూ, శ్రీరామచంద్రుడు  రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లారని కూడా ఒక కథనం వ్యాప్తిలో ఉంది .  మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది.

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya