Online Puja Services

మహిమాన్విత స్మశాననారాయణ దర్శనం

18.118.140.108

పితృదోషాలని నివారించే మహిమాన్విత స్మశాననారాయణ దర్శనం 
సేకరణ 

పితృదోషాలు తరాలవరకూ వెంటాడుతాయి . తమ వంశాన్ని ముందుకు తీసుకు వెళ్లే వారసులు లేకుండా చేస్తాయి. రకరకాల వైద్య పరీక్షలు చేయించుకున్నా , అందులో ఎటువంటి లోపమూ కూడా బయటపడదు.  కానీ సంతానం మాత్రం కలగదు . ఇలాంటి పరిస్థితి వెంటాడుతున్న జంటలు ఇవాళ సమాజంలో మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు . అటువంటి దోషాలని తొలగించి,  పితృ దేవతల అనుగ్రహాన్ని కలగజేసే క్షేత్రం గురించిన విశేషాలు ఇవాళ మీకోసం . 

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళితే గానీ , రోజుగడవని స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. ఇంకా , సౌకర్యవంతమైన జీవితం కోసం , ఇటువంటి సంస్కృతీ కూడా ఎక్కువవుతోంది . ఈ బిజీ జీవితంలో పడి మనకి  పితృ దేవతలా తిధులని పాటించడానికి , వారికి కనీసం పిండ ప్రదానం చేయడానీకీ కూడా సమయం లేకుండా పోతోంది . కానీ దానివల్ల లభించే దోషాలు నిస్సంతుగా శాపాన్నిస్తాయి. అది మనం గ్రహించాలి . సంవత్సరానికొకసారి వచ్చే పితృదేవతల తిథిని పాటించాలి . ఇప్పటికే అటువంటి దోషంతో బాధపడుతుంటే, వాటిని తొలగించే మహామహిమాన్వితమైన క్షేత్రం స్మశాన నారాయణుని దర్శనం చేసుకోవడం ఉత్తమం . 

ఈ క్షేత్రం పితృదోషాలున్న వారికి నిజంగా ఒక వరంలాంటిదని చెప్పొచ్చు . ఈ క్షేత్రదర్శనం పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం. పితృదోషం అంటే,  మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ,అలాగే తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది . 

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే, అది తెలిసికావొచ్చు ,తెలియక కావచ్చు, ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు. మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే పితృదోషం. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.

ఎందుకంటే అవి మన పెద్దలు చేసిన పాప ఫలాలు. హక్కుల వెంటే , బాధ్యతలు కూడా ఉంటాయి కదా ! వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు ఇలా ఉండొచ్చు :

 చిన్న వారు అకాలమరణం పొందడం, శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం, అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం, మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం, సంతానమా కలగకపోవడం ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం.

దీని నుండి విముక్తి పొందడానికి ఒక పరిష్కారం ఏమిటంటే, స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ! అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి. ఒకటి కాశీలో ఉండగా, రెండవది తెలంగాణాలోని పాపనాశి ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)లో ఉంది . అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.

విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో, తెలుగు నేలమీద  ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి:

స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే, పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి.  ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెట్టి  ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు.ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) . 
 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి. 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.

ఈ ఆలయ ప్రాముఖ్యము తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..

 స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!

ఇలా చేరుకోవచ్చు :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya