Online Puja Services

వారంలో ఇలా సాంబ్రాణి ధూపం వేస్తే ఎంతో మంచిది.

18.190.217.134

వారంలో ఇలా సాంబ్రాణి ధూపం వేస్తే ఎంతో మంచిది. 
- లక్ష్మీరమణ  

సాంబ్రాణి దాపం వెయ్యడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పండితులు చెబుతారు. గుగ్గులం కలిపిన సాంబ్రాణిని కరోనా సమయంలో ఇల్లంతా వేయడం అందరమూ చేసిందే . దీనివల్ల సూక్ష్మ క్రిములు నాశనమవుతాయని చెబుతారు పెద్దలు . కంటికి కనపడని క్రిములని నాశనం చేయడమే కాకుండా కంటికి కనిపించని చెడు శక్తులని దూరంగా తరిమేసే ఈ సాంబ్రాణి ధూపాన్ని ఒక సంప్రదాయంగా పాటించామన్న మన సనాతనధర్మం గొప్పదనాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సాంబ్రాణి ధూపాన్ని వారంలో ఒక్కొక్కరోజు వేయడంవలన ఆధ్యాత్మికంగా అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు . ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం . 
 
సాంబ్రాణి ధూపం వెయ్యటం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  గుగ్గిలంతో కలిపి సాంబ్రాణి ధూపం వెయ్యటం ద్వారా వారంలోని ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో ఫలితం పొందవచ్చని వారు చెబుతున్నారు. 

ఆదివారం పూట గుగ్గిలంతో కలిపినా సాంబ్రాణి ధూపాన్ని వేస్తే - ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. 

సోమవారం ఈ ధూపాన్ని వేయడం వలన దేహ, మానసిక ఆరోగ్యవృద్ధి; మానసిక ప్రశాంతత, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 

మంగళవారం ఇలా సాంబ్రాణిని వెలిగించి ఇల్లంతా ధూపం వేస్తే , శత్రుభయం, ఈర్ష్య, అసూయల వలన కలిగే దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి వాళ్ళ కలిగే బాధలు ఉండవు.   అప్పుల బాధ తొలగిపోతుంది. వీటితోపాటు కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. 

బుధవారం నాడు ధూపాన్ని వెలిగించడం చేత  నమ్మకద్రోహం, ఇతరులకుట్ర నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుంది.  పెద్దలు, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి.  ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. 

గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురుఅనుగ్రహంతో సకల సత్ఫలితాలు చేకూరుతాయి.  చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

శుక్రవారం దేవీపూజకి ప్రశస్తమైన రోజు . అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం . కనుక , ఆరోజు ఇల్లంతా శుభం చేసుకొని, గుగ్గిలంతో కలిపి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేయడం ద్వారా లక్ష్మీ  కటాక్షం సిద్ధిస్తుంది .  శుభకార్యాలు చేకూరుతాయి.  అన్ని కార్యాలలోనూ  విజయాలు ఉంటాయి. శుక్రవారం లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. 

శనివారం దుర్ముహూర్తమని నానుడి.  ఈ రోజు ఉదయాన్నే లేవాలి. పూజానంతరం శనివారం ధూపం వేయడం వలన సోమరితనం తొలగిపోతుంది.  ఈతి బాధలు ఉండవు. వేంకటేశ్వరుడు, శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహాన్ని పొందొచ్చు.

ఇలా వారం రోజులపాటు చక్కగా ప్రతి రోజూ ఇంట్లో ధూపం వెయ్యడం వలన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది . శుభాలు , సంతోషాలు వెల్లివిరుస్తాయి . వాటితో పాటుగా లక్ష్మీ అనుగ్రహం ఉటుంది. శుభం.  

#sambrani #dhupam

Tags: sambrani, dhoopam, dhupam

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi