Online Puja Services

శనివారం ఆంజనేయపూజ - శని ప్రభావాన్ని తొలగిస్తుందా ?

3.145.47.253

శనివారం ఆంజనేయపూజ - శని ప్రభావాన్ని తొలగిస్తుందా ?
-లక్ష్మీ రమణ 

శనివారానికి మందవారమని పేరు . శనికి కూడా మందుడనే పేరుంది . శనివారమంటే, శనీశ్వరునికి మహాప్రీతి. మరి మంగళవారం ఆంజనేయునికి ప్రీతి. కానీ, శనివారం నాడు ఆంజనేయుని పూజింతడం అంతమైన ఫలితాలని అందిస్తుంది. శని బాధనుండీ నివారణ కల్పిస్తుంది. శని ప్రభావం నుండీ బయటపడేయగలవాడు పవనతనయుడేననేది మన ధర్మగ్రంధాలు చెబుతున్నమాట . ఆ శనివారాలు వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం .

శనిగ్రహం విధి వశాత్తు మహా క్రూరస్వభావుడైన స్వామి .  కానీ ఆయన అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. శివుణ్ణి కూడా విధినిర్వహణలో వదలనివాడు . అదే క్రమంలో కాస్త గర్వం తలకెక్కింది .  ఒకసారి ఆ రుద్రాంశే అయిన  హనుమను సమీపించి, శని దేవుడు  ‘’మారుతీ !నేను శనిని .అందర్ని పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు .’’అన్నాడు. దానికి హనుమ ‘’శానీశ్వరుడా !నన్ను పట్టు కొంటావా ?లేక నాలో ఉంటావా ? నాలో ఉండ దలిస్తే ఎక్కడ ఉండాలని కోరిక గా వుంది ?’’అని ప్రశ్నించాడు .అప్పుడు శని హనుమ శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకొన్నాడు మారుతి .

ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకి ఎత్తుకొన్నాడు హనుమ .’’కుయ్యో మొర్రో అని ఆ భారం భరించ లేక శని గిల గిల తన్నుకుని, బరువు దించమని ప్రాధేయ పడ్డాడు శని. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి, సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు హనుమ . ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ,ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి ‘’మందా ! నన్ను పట్టు కొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు .అప్పుడే గిజగిజ లాడి పోతున్నావె?’’అని ప్రశ్నించాడు .’’ప్రజలను బాధించటమే నీ ధర్మం గా ప్రవర్తిస్తున్నావు . అందుకని, నువ్వు నా షరతుకి ఒప్పుకుంటేనే  నిన్ను వదిలిపెడతాను’’అన్నాడు . గత్యంతరం లేక శని సరే నన్నాడు .

అప్పుడు హనుమ ‘శనీ! నా భక్తులను నువ్వు బాధించ రాదు. నన్ను పూజించే వారిని ,నా మంత్రాన్ని జపించే వారిని ,నా నామ స్మరణ చేసే వారిని ,నాకు ప్రదక్షిణం చేసే వారిని ,నా దేవాలయాన్ని సందర్శించే వారిని ,నాకు అభిషేకం చేసే వారిని ఏకాలంలో నైనా ముట్టుకోకూడదు . నువ్వు బాధించ రాదు. మాట తప్పితే కఠినాతి కఠినమైన దండన తప్పదు ‘’అని శాశించాడు. ఆ విధంగా శనీశ్వరుని వద్ద  వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు . అందుకే శనివారం ఆంజనేయుని పూజ గొప్ప ప్రాధాన్యత సంతరించు కొన్నది .

శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల ఆయనకీ శరీరమంతా గాయాలై బాధించాయి .ఆ బాధా నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు.ఈ విధం గా తైలాభిషేకం చేసిన వారిని శని దేవుడు బాధించరు. 

‘’ మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే ;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా ‘’ అని శాస్త్రం . 

శని వారం రాగానే హనుమను పూజించాలి .ఆయన శని వారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది .అందుకే శని వారం చేసే హనుమ పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.  

’’సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః ‘’అని శృతి వచనం.  ప్రతి శని వారం భరతుడు హనుమ ను సేవించి పరాక్రమ వంతుడు అయ్యాడు అని అర్ధం . అందులోనూ శ్రవణా నక్షత్రం తో కూడిన శనివారం నాడు ఆయనకీ రుద్ర మంత్రాలతో తైలాభి షేకం చేయాలి .తైలం తో కూడిన గంధసిన్దూరాన్ని హనుమంతునికి అలిమితే , ఆయన ప్రీతి చెందుతాడు . అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగు తుంది . వ్యాధి నుండి విముక్తి కలిగి, బుద్ధి బలం పెరుగు తుంది.  శత్రు జయం కల్గి, మిత్ర సమృద్ధి హెచ్చి ,యశోవంతులైన పుత్రులు కలుగుతారు . మాఘ ,ఫాల్గుణ ,చైత్ర ,వైశాఖ ,జ్యేష్ట మాసాలలో ఏ మాసం లో నైనా కాని ,కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాని శని వార వ్రతం చేయాలి .

శనివార వ్రత విధానం :
ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని ,కొత్త పాత్రలతో మడిగా  నీరు తెచ్చుకొని హనుమకు అభిషేకం చేయాలి .అన్ని వర్ణాల వారు ,స్త్రీలు కూడా చేయవచ్చు . నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి . ఆరోజునాడు ఉపవాసం చేయడం కూడా మంచి ఫలితాలని అందిస్తుంది. 

ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి .అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యదావిధిగా జపించాలి .దీని వల్ల జన వశీకరణ కలుగుతుంది .ధన లాభం ,ఉద్యోగ ప్రాప్తి ,కారాగృహ విమోచనం లభిస్తాయి .

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha