Online Puja Services

ముగ్గురమ్మల స్వరూపం... మూకాంబికా దేవి.

3.146.105.137

ఓం శ్రీ మాత్రే నమః 

ముగ్గురమ్మల స్వరూపం... మూకాంబికా దేవి.

సరస్వతి, మహాకాళి, శక్తి  సంయుక్త స్వరూపం.

♦️శివుని వరం పొందిన "కామాసురుడు".. కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించేవాడు. 
సప్తర్షులు, దేవతలు అతని నుంచి ఎలా తప్పించు కోవాలా అని ప్రయత్నాలు చేశారు. 

♦️ఈ విషయాన్ని "శుక్రాచార్యుడు" కామాసురుడి చెవిన వేసారు. 
అతని చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. దీంతో వెంటనే ఆ రాక్షసుడు... శివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేసాడు. 
శివుడు ప్రత్యక్షమై రాక్షసుడిని వరం కోరుకోమన్నాడు. 

♦️కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించిన వాగ్దేవి సరస్వతీ దేవి... 
వాడి నాలుక పై చేరి మాట రాకుండా... 
మూగ వాడిని చేసేసింది. 

♦️మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు.
అప్పటి నుంచి ఆ రాక్షసుడిని ''మూకాసురుడు'' అని పిలిచేవారు.

♦️''కోల రుషి'' ఉపాయం మేరకు "పార్వతీ దేవి" సకల దేవతల శక్తులన్నిటిని కలిపి... 
ఒక తీవ్రశక్తిగా సృష్టించింది. 
ఆ శక్తి మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. 

♦️మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని ''మారణ కట్టే'' అంటారు(మరణ గద్దె). 
ఆ తరువాత మూకాసురుని ప్రార్ధన మన్నించి అతనికి కైవల్యం ప్రసాదించింది.

♦️మూకాసురుడు కోరిక మేరకు అమ్మవారు కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది. 

♦️ఈ ఆలయంలో "మూకాంబికా దేవి" పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.

♦️జగద్గురు "ఆదిశంకరులు" కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి... అమ్మవారు ప్రత్యక్షమైంది. 

♦️ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి... 
అందుకు ఒక షరతు విధిస్తుంది. 

♦️అదేమంటే... తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని...
ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తారు శంకరులు. 

♦️ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు.
కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో...వెనక్కు తిరిగి చూస్తారు శంకరులు. 

♦️ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. 
తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో... తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. 

♦️జగద్గురువు తన తప్పును క్షమించి... 
కేరళకు రమ్మని కోరగా తాను...
పొద్దుటి పూట కేరళలోని చోటానిక్కరలో ఉన్న "భగవతీదేవి" ఆలయంలోనూ...
మధ్యాహ్నం "కొల్లూరు"లోనూ ఉంటానని చెప్పిందట

♦️పురాణాల ప్రకారం మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసే... "పంచకడ్జాయం' అనే ప్రసాదం పెడతారు. 
పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత... ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. 

♦️ఇదంతా చూసిన చదువురాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కుని ఆ ప్రసాదాన్ని తిన్నాడట.
అమ్మవారికి నివేదించిన ప్రసాదం తిన్నందువల్ల అతడు మహాపండితుడు అయ్యాడని అంటారు. 

♦️ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని... 
ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం. 

♦️ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహా పండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయి అని నమ్మకం.

- సత్య వాడపల్లి  

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda