Online Puja Services

జ్వాలాదేవి ‘కాంగడా’ !

3.145.163.58

ముష్కరుల దాడికి సమాధానం చెప్పి, వారిచేతనే పూజలందుకున్న జ్వాలాదేవి ‘కాంగడా’ !
సేకరణ 

అక్బర్ ఈ జ్వాలాముఖి గుడిని నాశనం చేసే ఉద్దేశ్యంతోనే వచ్చాడు. అఖండ జ్యోతిని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. రెండడుగుల మందంగల ఇనుప దిమ్మలను పెట్టించాడు ఆ జ్యోతిపైన.  ఈ సృష్ఠి మొదలైనప్పటినుండి ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే వుంది. దానిని ఆర్పడం ఆయన తరం కాలేదు. అలాంటి నాలుగైదు దిమ్మలు పెట్టిచాడు. ఆ ఇనుప దిమ్మల మధ్యనుండి జ్యోతి పైకి వచ్చింది. ఈరోజునకూడా ఆ ఆనవాళ్లు కనబడతాయి. అక్బర్ తన తప్పును తెలుస్కుని అమ్మవారి క్షమను అర్ధించి బంగారు ఛత్రం చేయించి సమర్పించుకున్నాడు. నేటికి ఆ ఛత్రాన్ని ఆలయంలో మనం దర్శించవచ్చు. ఆ తర్వాతనే హిందూ మతాన్నికూడా గౌరవించడం మొదలుపెట్టాడు. రాజ్యంలో బీర్ బల్ అనే పండితుడికి స్థానం కల్పించాడు. హిందూ రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. 

షాజహాన్ ఈ జ్వాలల అంతు తానూ చూస్తానని అక్బర్ పాదుషాకి సాధ్యంకాని పని తానూ సాధిస్తానని బయల్దేరాడు.  కొన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు తెప్పించి ధారాపాతంగా ఆ జ్వాలాస్వరూపమైన జగన్మాత మీద పోయించాడు. అలా ఎన్ని రోజులు పోసినా, నెలలు గడిచిపోతున్నా,  జ్వాలలు ఆరలేదు.  సరికదా నీటి సమస్య వచ్చింది,రాజ్యంలో ఎక్కడ ఒక్క నీటి చుక్క లేకుండా చెరువులు బావులు ఇంకిపోయాయి .అప్పుడు అమ్మవారి శక్తిని అంగీకరించి క్షమాపణ కోరి వెనుదిరిగాడు.

ఔరంగజేబు ,వారిద్దరికంటే తానూ ఘనుడనని , బయల్దేరాడు సైన్యంతో సహా. కాని పఠాన్ కోట్ తర్వాత ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా మాత గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి తేనెటీగలు సైన్యాన్ని చుట్టుముట్టి ,కుట్టి కుట్టి చంపేశాయి. బతుకు జీవుడా అనుకుంటూ ఆగ్రా పారిపోయాడు. ఈ రోజుకీ కాగడా మాత, జ్వాలాజీ మాత గుళ్లలో ఆ ఆనవాళ్లు కనబడతాయి. తొమ్మిది రంగులలో గోడమీద జ్వాల వెలుగుతూంటుంది ఈ రోజుకికూడా. మినుకు మనుకు మంటూ ఆరడానికి సిధ్ధంగా వున్న జ్యోతి ఎప్పటినుండి అలా వెలుగుతోందో ఆర్కియాలజిస్టుల దగ్గర వున్న పరికరాలు కూడా చెప్పలేకపోతున్నాయి.

హిందూ మతాన్ని విమర్సించే వాళ్లకు ఈ గుడి చూపించండి చాలు. ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేశారు. కింద భూమిలో పెట్రోలుందని తవ్వి చూసి అలాంటిదేమీ లేదని జుట్టుపీక్కుంటూ వెళ్లిపోయారు. ఆ గుడిలోనే గోరఖ్ నాథుడి ఉపాలయం వుంది. ఎలాంటి వెంటిలేషన్ లేనిచోట ఒక గొయ్యి ప్రక్కనే ఒకటిన్నర అడుగు ఎత్తు వరకూ అఖండ జ్యోతి వెలుగుతూంటుంది. మామూలుగానైతే ఆ గోతిలోని నీరు వేడెక్కిపోవాలి. కానీ ఆ నీరు చల్లగా ఫ్రిజ్ వాటర్ మాదిరి చల్లగా వుంటాయి. ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి మాడి మసైపోవాలి కాని అలా జరగదు. ఈ ఔరంగజేబు ఉదంతం తర్వాతే ఆ గుడికి ప్రాముఖ్యత లేక దాదాపు జీర్ణవ్యవస్థకు చేరుకుంది. ఈ మధ్య దానిని బాగు చేశారు. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో ఈ గుడి దర్శనీయంగా అద్భుతంగా ఉంటుంది . 

 దేవీమాత విరాజిల్లడం వెనుక మరొక కథ కూడా ఉంది . దక్షయజ్ఞం తర్వాత సచీదేవి శరీరభాగాలు పడిన ప్రాంతాలలో ఈ ప్రాంతం కూడా ఒకటని విశ్వసిస్తారు . ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు . ఇక ఈ అటవీప్రాంతానికి గోవులు కాయడానికి వచ్చే ఒక కాపరి రోజూ ఒక గోవు ఒక చిన్న పాపకి పాలిచ్చి వెనుతిరిగి వస్తూడడాన్ని, ఆ పిల్ల పాలు తాగేసి , ఒక జ్వాలా స్వరూపమై ఈ కొండగుహల్లోకి వెళ్లిపోవడాన్ని గమనిస్తాడు . ఈ ఉదంతాన్ని అప్పటి కాంగడా మహారాజు అయిన  రాజా భూమిచంద్రకి తెలియజేశాడు . అదేరోజు రాత్రి దేవి కలలో సాక్షాత్కరించి, ఆ జ్వాల తన నాలుకని , అక్కడ దేవాలయాన్ని నిర్మించామని ఆదేశించింది . అలా అంటారా కాలంలో ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు . ఆ తర్వాత పాండవులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని స్థల ఐతిహ్యం .  అంటే ఈ ఆలయం పాండవుల కాలం నాటికన్నా పురాతనమైనది అర్థ అవుతుంది . 

ఈ ఆలయంలో రెండు నిండి పదేళ్ల లోపు పిల్లలని దేవీ స్వరూపాలుగా భావించి పూజలుచేస్తారు . ఈవిధంగా కన్యలను పూజించడం వలన దారిద్య్రం తొలుగుతుందని, దుఃఖ, శత్రునాశనం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆలయంలో ఇతర ప్రధాన దేవీ దేవతల విగ్రహాలు ఏవీ ప్రత్యేకించి కనిపించవు . క్రిందవెలుగుతున్న జ్వాల, పైన కాళికా దేవి రూపం ఉంటాయి . అలా ఈ ఆలయంలో 9 జ్వాలలు ఉంటాయి . ఆ జ్వాలలు నవ దుర్గా స్వరూపిణిలుగా ఆరాధించబడుతున్నారు . ఈ ఆలయం చుట్టుపక్కల అష్టభుజి రఘునాథ్ , నాగిని, మాతా అర్జున్ నాగ ఆలయాలు ఉంటాయి . 

 ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఖంగ్ర లోఉన్నది. 34 కిలోమీటర్ల దూరంలో ఉండే ‘ఉనా’ రైల్వే స్టేషన్ చేరుకొని, అక్కడి నుండీ ఆటోల్లో, బస్సుల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు .  

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi